నేను ఈ రోజు ఒక మోటార్ బైక్ మీద ఒక విషయాన్ని చదివాను . అది "ఐ లైక్ గల్స్ బట్ ఓన్లీ టెన్ మినిట్స్ "అని ఉంది . అది మొదటిగా చూసి చదివినప్పుడు కొంచెం వింతగా అనిపించింది . మరికొంచెంసేపు ఆగి ఆలోచిస్తే ఎందుకలా అనే సందేహం కలిగింది . మళ్ళీ వెంటనే తేరుకొని He does want girls only for sex need అని అర్ధమైంది . అంటే స్త్ర్రీలు అందుకు తప్ప దేనికీ పనికిరారనే ఒక నిశ్చిత అభిప్రాయానికి అతను వచ్చాడు . లేదా స్త్రీలపై అపనమ్మకాన్నైనా పెంచుకొనిఉండాలి . ఇంకొంచెం లోతు గా పోతే ఆడవాళ్ళ ప్రేమ మీద అతనికి నమ్మకం లేదు అని చెప్పుకోవాలి . ఈ నమ్మకం లేని తనాన్ని అతను పెంచుకోవడానికి ఏదైనా బలమైన కారణ0 ఉండాలి . సరే కారణం మనకు తెలిసే అవకాసం లేదు . కాబట్టి అసలు ఇలాంటి ప్రేరణ నేటి తరంలో ఎందుకు కలుగుతుందో విజ్ఞత కలిగిన కొందరై నా ఈ టాపిక్ గురించి విశ్లేషిస్తే బాగుంటుందనిపించింది . ఆ ప్రయత్నం లో భాగమే ఈ వ్యాసం .
' స్త్రీ' ని ఆదిశక్తి గా పూజించమని మన సనాతన ధర్మం బోధిస్తుంది . ''ఎక్కడ స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలు నివసిస్తారు ''అనే ఆర్యోక్తి వినిపిస్తుంది . మనం ప్రయాణించే బస్సు లో కూడా''స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం '' అని రాసుంటుంది . మన పుట్టుకలోనే అమ్మతనాన్ని తెలిపే స్త్రీ మూర్తి కనిపిస్తుంది . మన అనుబంధాలలో అక్క , చెల్లి వంటి ఎన్నో మమకారాలతో కూడిన బంధాలున్నాయి . ఈ బంధాలన్నీ స్త్రీల పట్ల చెడ్డ ఆలోచనలు వచినప్పుడు , ఎందుకు గుర్తుకురావో అర్ధంకాదు . ఒక వేళ అర్ధమైనా! ఆ వ్యామోహంలో ఆలోచించే శక్తిని కోల్పోతున్నాడా ?అనేది ఆలోచించాలి .
ఈ మధ్య సెక్స్ కి సంబందించిన ఒక వ్యాస0 చదివాను . ఆ వ్యాసంలో నేటి తరం ఆహారపు అలవాట్ల ప్రభావం వలన కౌమార దశలో ఉన్న పిల్లలను హార్మోన్స్ నిలవనివ్వడం లేదని రాసారు . ఇది శాస్త్రపరంగా ఎంతవరకు నిజమో మనం చెప్పుకోవలసిన పని లేదు . అలాగే నేటి సినిమాల ప్రభావం కూడా అంతే ఉంది . సినీ గీత సాహిత్యంలో కూడా కౌమార దశలో ఉన్న పిల్లల్ని భావోద్వేగానికి గురిచేసే విధంగా ఉంది . ఇలా చెప్పుకుంటూ పోతే కారణాలకు అంతుండదు . ఇలాంటి పది నిమిషాల కోరికలు మనవాళ్ళ కేనా అంతకుముందు ఎవరికైనా ఉన్నాయా? అని ఆలోచిస్తే మన పురాణాలలో చాలామంది కనిపిస్తారు.
సాక్షాత్తు విష్ణుదేవుడు జలన్ధరుడి భార్యను రమించాడు . మోహిని అందాన్ని చూసి తట్టుకోలేక శివుడు ఆత్రాపడ్డాడు . బ్ర్హహ్మా దేవుడు తను సృష్టంచిన సరస్వతినే ఇష్టపడ్డాడు . దేవేంద్రుడైన ఇంద్రుడు అహల్యను పదినిమిషాల కోసమే కామించాడు . పరాశరుడు మత్యకన్యను చూసి ఆపుకోలేక మహాభారతాన్ని చేశాడు . విశ్వామిత్రుడు ఇంద్రుడి ఉచ్చులోపడి మేనక అందాలను పొందడానికి తపోభంగానికైనా ఇష్టపడ్డాడు . వ్యాసుడు ఘ్రుతాచిని మోహించాడు . వాలి తమ్ముడైన సుగ్రీవుని భార్యను అపహరించాడు . రావణుడు సీతమ్మ తల్లి సౌందర్యానికి తట్టుకోలేక గంగవెర్రులెత్తాడు . ఇవన్నీ తెలుసుకున్న వేమన " ఆడుదాని చూడ అర్ధంబు చూడ బ్రహ్మ కైన పుట్టు రిమ్మ తెగులు " అన్నాడు .
ఈకథల్లో మనం గమనించాలిసినవి రెండున్నాయి .
1. మహనీయులు చేసిన ఆ కార్యాలు లోక కల్యానార్ధం .
2. లోకకంటకులు చేసిన పాపాలు వారి వినాసనార్ధమ్ .
ఇది గమనిస్తే కొందరు చేసేపనులు లోకకంట కాలనే విషయం స్పష్ట మౌతుంది .
ఈ విధగా చెప్తే కొతమంది కొంటె కుర్రాళ్ళు మేముకూడా లోక కళ్యాణం కోసమే అని ఎందుకు అనుకోరు ?అన్నా ఆశ్చర్య పడాల్సిన పనిలేదు .
అసలు నేటితరం సెక్స్ అనే క్రియకు మాత్రమే ఎక్కువ విలువ ఇస్తున్నారు . ప్రేమకు,
దాని తాలూకు, మనసుకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వెనక అనేకమైన చేదు విషయాలున్నాయి .
ఆ విషయాల చర్చకు ఆహ్వానం ( ఇంకావుంది )(''చదవేస్తే ఉన్న తెలివి
సాంతంగా నశించింది
ఈ నాటి కామ వాంఛ
నానాటికి చెలరేగుతుంది
మన బాబుల వ్యవహారం
ఎవడు చెల్లించుతాడు
ఈ తప్పుడు పరిహారం " ?????????????????????????????????????????????????????
No comments:
Post a Comment